న్యాయం కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రాజ్ తరుణ్ ప్రేయసి..!

Divya
ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రాజ్ తరుణ్, లావణ్య, హీరోయిన్ మాల్వి మల్హోత్ర ఈ ముగ్గురి పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉన్నది.. ముఖ్యంగా రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశారని అబార్షన్ కూడా చేయించారంటూ మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. గడిచిన మూడు నెలల నుంచి మేము దూరంగా ఉంటున్నాము.. అందుకు కారణం హీరోయిన్ మాల్వి మల్హోత్రా అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవే కాకుండా ఎన్నో విషయాలను కూడా ఆమె తెలియజేయడం జరిగింది.

ఇప్పుడు తాజాగా తన లవర్ రాజ్ తరుణ్ కోసం లావణ్య ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. అన్ని ఆధారాలు సమర్పించి పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని రూ.5 కోట్ల రూపాయలు ఇస్తామని దీంతో తనని కేసు వెనక్కి తీసుకోవాలంటూ చాలామంది బెదిరిస్తున్నారు అంటూ ఆమె తెలియజేసింది. ఈ బాధతోనే తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించానని తెలిపింది. కానీ రాజ్ తరుణ్ తనకి కావాలని అతని కోసం నిరాహార దీక్ష చేస్తానంటూ ఆమె పట్టు పడి మరి కూర్చున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ విషయం మీద సినీ ఇండస్ట్రీలోని పెద్దలను త్వరలోనే కలుస్తానని లావణ్య తెలియజేసింది.. తన మీద లేనిపోని సాకు చెప్పి రాజు తరుణ్ తను దూరం పెట్టాలని చూస్తున్నాడు అంటూ లావణ్య ఆరోపించింది.. ఈ రోజున మీడియాతో మాట్లాడుతూ రాజ్ తరుణ్ కోసం తాను ఎంతవరకైనా వెళ్తానంటూ శబదం  చేసింది లావణ్య. అయితే ఇప్పటివరకు కేవలం రాజ్ తరుణ్ ఒక్కసారి మాత్రమే మీడియా ముందు వచ్చి మాట్లాడడం జరిగింది. లావణ్య తండ్రి కూడా తన కూతురికి న్యాయం జరిగే వరకూ పోరాడుతామంటూ తెలియజేశారు. అంతేకాకుండా రాజు తరుణ్ కుటుంబంతో ఉన్న బాండింగ్ ను కూడా తను తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: