23 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ వార్ కి సిద్ధమైన ఆ ఇద్దరు హీరోలు..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , విక్టరీ వెంకటేష్ ముందు వరుసలో ఉంటాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఇకపోతే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ ఇద్దరు హీరోలు ఈ సారి సంక్రాంతి రేసులో బరిలోకి దిగబోతున్నారు. వీరిద్దరూ దాదాపు 23 సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా తెలపడ్డారు.

23 సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరో గా రూపొందిన మృగరాజు సినిమా విడుదల కాగా ... వెంకటేష్ హీరో గా రూపొందిన దేవీ పుత్రుడు సినిమా కూడా విడుదల అయింది. ఇకపోతే ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. మరి వీరిద్దరూ 23 సంవత్సరాల తర్వాత మళ్లీ సంక్రాంతి పండుగకు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోతున్నారు. మరి ఈ సారి ఎవరిది పై చేయి అవుతుందో ... ఎవరు సంక్రాంతి విన్నర్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: