ఈసారి ఆ క్రికెటర్ ను బరిలోకి దించనున్న బిగ్ బాస్ యూనిట్.. అదే జరిగితే నేషనల్ వైడ్ క్రేజ్ కంపల్సరీ..?

Pulgam Srinivas
ఇండియాలోనే అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ కలిగిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ ప్రధమ స్థానంలో ఉంటుంది. ఇకపోతే మొదట ఇండియాలో హిందీ లో ప్రారంభం అయిన ఈ షో కు దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ రావడం మొదలు అయింది. దానితో ప్రాంతీయ భాషల్లో కూడా ఈ షో ను మొదలు పెట్టాలి అనే ఆలోచనను బిగ్ బాస్ బృందం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక ప్రాంతీయ భాషలలో కూడా బిగ్ బాస్ షో ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా తెలుగు లో కూడా చాలా సంవత్సరాల క్రితమే బిగ్ బాస్ షో ను స్టార్ట్ చేశారు.

ఇక ఇప్పటి వరకు తెలుగు లో బిగ్ బాస్ 7 బుల్లి తెర , ఒక ఓ టి టి సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే బిగ్ బాస్ 7 వ సీజన్ కంప్లీట్ అయింది. ఇందులో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఇకపోతే బిగ్ బాస్ బృందం మరికొన్ని రోజుల్లోనే బుల్లి తెర 8 వ సీజన్ ను మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంత మంది కంటెస్టెంట్లను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సారి టీమిండియా క్రికెటర్ ను బిగ్ బాస్ బృందం రంగం లోకి దించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... టీం ఇండియాలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఆటగాలలో ఒకరు అయినటువంటి అంబటి రాయుడు ను ఈ సారి బిగ్ బాస్ బృందం హౌస్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అంబటి రాయుడు కనుక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే తెలుగు బిగ్ బాస్ కి నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి అంబటి రాయుడు తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తాడా ... లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: