అఫీషియల్ : "పుష్ప 2" తమిళనాడు హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప మొదటి భాగంతో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలోని అల్లు అర్జున్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కి ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ చిత్రీకరణ జరుగుతుంది.
 

ఈ సినిమాను డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు చాలా రోజులు మిగిలి ఉన్నప్పటికీ ఇప్పటికే ఈ సినిమా యొక్క తమిళ నాడు హక్కులను ఈ మూవీ బృందం అమ్మి వేసింది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. ఈ సినిమా యొక్క తమిళ నాడు హక్కులను ఈ జీ ఎస్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

ఈ సంస్థ వారు ఈ సినిమాను తమిళనాడు లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రయత్నాలను ఇప్పటి నుండే మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... అనసూయ , సునీల్ రావు , రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: