కల్కి నుండి మృణాల్ ఠాకూర్ స్పెషల్ పోస్ట్.. వైరల్

murali krishna
సీతారామం’తోతెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మృణాల్‌ ఠాకూర్‌. సీతగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. అక్కడి నుంచి తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా 'కల్కి 2898 ఎడీ’  చిత్రంతో అతిథిగా మెరిశారు. ఆ పాత్రకు చక్కని స్పందన రావడంతో ఆనందంతో మునిగి తేలుతోందీ బ్యూటీ. సైన్స్ అండ్ ఫిక్షన్‌ జోనర్ ప్రాజెక్ట్‌ ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల విషయంలో టాక్ ఆఫ్‌ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే కాసుల వర్షాన్ని కురిపిస్తోన్న కల్కి.. బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డులు  సృష్టించిన విషయం తెలిసిందే.
కల్కి పార్ట్‌-2 కోసం ఇప్పటి నుంచే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమాలో అతిథి పాత్రల్లో మెరిసిన నటీనటుల ఫోటోలను చిత్ర యూనిట్ వరుసగా విడుదల చేస్తోంది.కల్కిలో విజయ్‌ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించగా.. ఆయనకు సంబందించిన ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. తాజాగా మృణాల్ ఠాకూర్ పోస్టర్‌ను వదిలింది.‘కల్కి 2898 ఏడీ ప్రపంచం నుంచి మృణాల్ ఠాకూర్‌ను దివ్యగా పరిచయం చేస్తున్నాం’ అని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పేర్కొంది. కల్కి సినిమా గురించి మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ‘సినిమా విజువల్స్‌ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. కాస్ట్, మ్యూజిక్, వీఎఫ్‌ఎక్స్‌, కాస్ట్యూమ్స్‌.. ఇలా ప్రతీ చక్కగా కుదిరాయి. ఈ మాస్టర్పీస్‌ను అందించిన నాగ్‌ అశ్విన్‌కు ధన్యవాదాలు. ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్, కమల్హాసన్‌ యాక్టింగ్ సూపర్. పార్ట్‌ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జూన్ 27 రిలీజ్ అయిన విషయం తెలిసిందే.సినిమా మొదట్లోనే ఓ చిన్న క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ కనిపించారు.ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్‌ను ఆమె చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: