సంక్రాంతి అంటే వారు కంపల్సరీనా.. ఈసారి మళ్లీ పోటీకి సిద్ధం అయిన ఆ ఇద్దరు హీరోలు..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో సంక్రాంతి వచ్చింది అంటే టాలీవుడ్ సీనియర్ హీరోల సందడి ఎక్కువ అవుతుంది. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నటసింహం బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీపడ్డారు. పోయిన సంవత్సరం మొదటగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి సినిమా విడుదల కాగా ... ఆ తర్వాత రోజు చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయింది. ఇకపోతే ఓవరాల్ గా చూసుకుంటే వాల్టేర్ వీరయ్య ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలవగా ... వీర సింహా రెడ్డి సినిమా కూడా మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది.

క ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ సీనియర్ హీరోలు అయినటువంటి వెంకటేష్ , నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటగా వెంకటేష్ హీరోగా రూపొందిన సైంధవ్ సినిమా విడుదల కాగా ... ఆ తర్వాత నాగార్జున హీరో గా రూపొందిన నా సామి రంగ మూవీ విడుదల అయింది. ఇందులో సైంధవ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టగా ... నా సామి రంగ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక వచ్చే సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ కు సీనియర్ హీరోల సందడి ఉండబోతుంది.

ఇప్పటికే చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ప్రస్తుతం వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఆ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇలా వచ్చే సంవత్సరం కూడా సంక్రాంతి పండుగకు ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: