బిగ్ బాస్ 8 లో సంచలనాలు !

Seetha Sailaja
రియాలిటీ షోలలో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సంవత్సరాలుగా సంచలనాలు సృష్టిస్తున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకు తెలుగు ప్రేక్షకుల నుండి కూడ మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షో త్వరలో తన 8వ సీజన్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈసారి కూడ స్టార్ మా నిర్వాహకులు ఈ షోను విభిన్నంగా డిజైన్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్. గత 5 సీజన్స్ లో హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున మళ్ళీ ఈ సీజన్ కు కూడ హోస్ట్ గా వ్యవహరిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అనుకోని కారణాలు వల్ల ఈ షోకు నాగార్జున అందుబాటులోకి రాలేకపోతే ఆ స్థానాన్ని బాలకృష్ణ చేత పూర్తి చేయించాలని నిర్వాహకుల ఆలోచన అని అంటున్నారు.

ఇప్పటికే ఈ షో నిర్వాహకులు ఈషోలో పాల్గొనే హౌస్ మేట్ ల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు కుమారి ఆంటీ ఈ షోలో పాల్గొనే సెలెబ్రెటీల లిస్టులో ముందు వరసలో ఉంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇక మిగతా సెలెబ్రెటీల లిస్టులో ప్రముఖుల జాతకాల విషయంలో సంచలనాలకు కేరాఫ్ గా మారిన వేణు స్వామి జబర్దస్త్ ఆర్టిస్టు నుంచి చేపల పులుసు బిజినెస్ లోకి మారి ఆ తర్వాత రాజకీయ ప్రచారకర్తగా మారిన కిరాక్ ఆర్పి ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి వెళ్ళిన బర్రెలక్క, టీవీ ఆర్టిస్టులు తేజస్విని, అక్షిత, హారిక, సాయికిరణ్ పాటు స్టాండప్ కమెడియన్ శ్యామా హరిణి కూడ ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది.  

వీరితో పాటు హీరో రాజ్ తరుణ్ ను ఇప్పటికే స్టార్ మా బిగ్ బాస్ టీమ్ సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా రాజ్ తరుణ్ కొన్ని  వివాదాలలో చిక్కుకోవడంతో అతడి ఎంపిక ఫైనల్ లిస్టులో ఉండకపోవచ్చు అన్న వార్తలు కూడ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: