ఆ మిస్టేక్ చేసిన మహేష్.. అలా చేసిన బాగుండేది అంటున్న ఫ్యాన్స్..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. జయరామ్ , రమ్యకృష్ణ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించగా ... రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకుంది.

ఇకపోతే మహేష్ బాబు తన తదుపరి మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి తో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ మరో రెండు , మూడు నెలల్లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రాజమౌళి సినిమా అంటే రెండు , మూడు సంవత్సరాలు షూటింగ్ కే పడుతుంది. అలాగే ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియదు.

దానితో రాజమౌళి తో సినిమా అంటే ఆయనతో ఏ హీరో అయితే సినిమా చేస్తున్నాడు ఆయన అభిమానులు ఒక వైపు ఆనందంగా ఉన్న మరో వైపు చాలా సంవత్సరాలు తమ అభిమాన నటుడిని వెండి తెరపై చూసే అవకాశం లేనందుకు బాధపడుతూ ఉంటారు. ఇకపోతే ఇప్పటికే గుంటూరు కారం సినిమా విడుదల అయ్యి ఆల్మోస్ట్ 6 నెలలు అవుతుంది. మరో రెండు , మూడు నెలల వరకు రాజమౌళి తో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల ఈ గ్యాప్ లో మహేష్ ఒక సినిమా చేసి విడుదల చేసి ఉంటే బాగుండేది అని ఆయన అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: