మైత్రి చేతికి మరో సినిమా.. ఈసారి అలాంటి ఎంటర్టైనర్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో మైత్రి సంస్థ ఒకటి. ఈ సంస్థ వారు మొదటగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన శ్రీమంతుడు సినిమాను నిర్మించారు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాను వీరు నిర్మించారు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం మూవీ ని ఈ బ్యానర్ వారు నిర్మించగా ఇది బ్లాక్ బస్టర్ అయ్యింది.
 

ఇలా వీరు నిర్మించిన సినిమాలు అద్భుతమైన విజయాలు సాధిస్తూ వెళ్లడంతో వీరి సినిమాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇక వీరు ప్రస్తుతం సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నారు. అందులో భాగంగా మీరు నైజాం ఏరియాలో ఇప్పటికే తమ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకొని చాలా సినిమాలను పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వీరు డిస్ట్రిబ్యూట్ చేసిన అనేక సినిమాలు అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి.

తాజాగా ఈ సంస్థ వారు ఒక చిన్న సినిమా యొక్క నైజాం హక్కులను కూడా దక్కించుకున్నారు. తాజాగా ప్రియదర్శి హీరోగా నబా నటేష్ హీరోయిన్గా కామెడీ ఎంటర్టైనర్ మూవీగా రూపొందిన డార్లింగ్ మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను మైత్రి సంస్థ వారు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. జూలై 19 వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాని నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి మైత్రి సంస్థ వారు ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: