ఫ్లాష్ సీతారామరాజుగా మారబోతున్న ప్రభాస్ !

Seetha Sailaja
దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న ‘కల్కి 2898’ గురించి మీడియా అన్ని భాషలలోను వార్తలు వరాస్తోంది. కొన్ని నెలలుగా సినిమాలు చూడటం మానేసిన ప్రేక్షకులు మళ్ళీ ధియేటర్ల బాట పట్టడంతో ధియేటర్లు అన్నీ కళకళలాడుతున్నాయి. ఈసినిమా ఘనవిజయంతో ప్రభాస్ కుటుంబ సభ్యులు కూడ మంచి జోష్ లో ఉన్నారు.

ఈనేపధ్యంలో ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామలా దేవి ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ కు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలను షేర్ చేశారు. తన కొడుకు ప్రభాస్ కోహినూర్ వజ్రం అని అంటూ ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ నటించిన ఏనుగు సీన్ హైలెట్ అయిందని చెపుతూ ఆ సీన్ తనకు విపరీతంగా నచ్చడంతో ప్రత్యేకంగా తాను ఏనుగు బొమ్మ డిజైన్ శారీలను ప్రత్యేకంగా డిజైన్ చ్చేయించుకుని తన మెడలో కూడ ఏనుగు బొమ్మ గొలుసు వేసుకుని తమ బంధువుల ఇళ్ళల్లో జరిగే పెళ్లిళ్లకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయని ఆమె వివరించింది.  

ఇక ప్రభాస్ లాంటి కొడుకు కలిగి ఉండటం ఎవరికైనా ఎంతో అదృష్టం అంటూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించింది. కృష్ణంరాజు జీవించి ఉన్న రోజులలో అల్లూరి సీతారామరాజు సినిమా తీయాలని ప్రయత్నించిన విషయాన్ని వివరిస్తూ మధ్యలో సూపర్ స్టార్ కృష్ణ ఆసినిమాను తీయడంతో అప్పట్లో తన భర్త ఆప్రయత్నాన్ని విరమించుకున్న అప్పటి విషయాలను గుర్తుకు చేకున్నాడు. అయితే ఆసినిమా విడుదలై 50 సంవత్సరాలు దాటిపోవడంతో ప్రభాస్ ను అల్లూరి సీతారామరాజుగా చూడాలని తన కోరిక అంటూ ప్రభాస్ కు కూడ ఆపాత్రను చేయాలని ఉంది అన్న విషయాన్ని ఆమె బయట పెట్టింది.

తన భర్త జీవించి ఉన్నరోజులలో కొన్నిసార్లు ప్రభాస్ నటిస్తున్న సినిమాల షూటింగ్ లకు వెళ్ళి తన వంశానికి పేరు తెస్తున్న ప్రభాస్ ను చూసి మురిసిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని అంటోంది. 40 సంవత్సరాల క్రితం కృష్ణం రాజు హీరోగా ‘కల్కి’ అన్న సినిమా మొదలైందని అయితే ఆమూవీ ఎందుకు ఆగిపోయిందో తనకు తెలియదని శ్యామ ల  దేవి అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: