సినీ ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ సింగర్ భర్త మృతి..!

Divya
టాలీవుడ్ బాలీవుడ్ తమిళ్ మలయాళం ఇలా ఎన్నో భాషలలో కూడా ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న స్టార్ సింగర్స్ లలో సింగర్ ఉషా ఉతుప్ ఒకరు. పద్మశ్రీ, పద్మ విభీషణ్ వంటి అవార్డులను కూడా అందుకున్నది. వయసు పెరగడంతో అడపాదడపా సినిమాలలో పాటలు పాడుతూ ఉన్నది ఈ సింగర్.. టీవీ షోలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది  ఉషా ఉతుప్. అయితే గడిచిన కొన్ని గంటల క్రితం ఈమె భర్త మరణించినట్లుగా తెలుస్తోంది.

 ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ నిన్నటి రోజున రాత్రి సమయంలో గుండెపోటు రావడంతో  మరణించినట్లుగా తెలుస్తోంది. మీరు నిన్నటి రోజున కోల్కత్తాలో తమ ఇంట్లో ఉండగా హార్ట్ ఎటాక్ రావడంతో జానీ చాకో కి హార్ట్ ఎటాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని వైద్యులు కూడా ధ్రువీకరించారు. ఈ వార్త విన్న జాకీచాకో కుటుంబ సభ్యులు కూడా మీడియా ముందుకు తెలియజేయడం జరిగింది. ఉషా ఉతుప్ కుమారుడు సన్ని, కుమార్తె అంజలి ఈ విషయాన్ని తెలియజేశారు. అలాగే తన తండ్రి అంత్యక్రియలు కూడా కోల్కతాలోని ఈరోజు నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు.

ఈ విషయం తెలిసి పలువురు అభిమానులు ప్రేక్షకులు సైతం జాకీ మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. జాకి కూతురు అంజలి.. సోషల్ మీడియా వేదికగా ఇలా తెలియజేస్తూ.. అప్ప నువ్వు చాలా త్వరగా వెళ్ళిపోయావు.. కానీ నువ్వు జీవించినంత స్టైల్ గా ఈ ప్రపంచంలో ఎవరు జీవించారు.. నువ్వే అందమైన మనిషివి మేము నిన్ను చాలా మిస్ అవుతున్నామంటు తెలియజేసింది. ఉషా ఉతుప్ కు జానీ చాకోకి రెండవ భర్త నట. గతంలో రాము అనే వ్యక్తితో ఏమీ మొదటి వివాహం జరగగా.. కొన్ని కారణాలు చేత వీరిద్దరూ విడిపోయారు. జాకి ప్రముఖ వ్యాపారవేత్తలలో కూడా ఒకరట. మొదట ఈయన తేయాకు వ్యాపార చేసేవారట. 1970 లలో ఉషాని మొదటిసారి కలిశారు ఆ తర్వాత కొద్ది రోజులకి వీరు వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: