షాక్: వాడిని జైల్లో వేసి చితక్కొట్టాలి.. రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్..!

Divya
గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో చైల్డ్ అబ్యూస్ వీడియోల పైన ఒక రెవల్యూషన్ మొదలయ్యింది.. చాలామంది చిన్న పిల్లలనీ చూడకుండా కొంతమంది పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీడియోలు షేర్ చేస్తూ వారి యొక్క సునకానందాన్ని పొందుతూ ఉండగా.. ఇలాంటి వాటిని చెక్ పెట్టే విధంగా ఆయా ప్రభుత్వాల సైతం నిర్ణయాలు తీసుకోవాలని పలువురు సెలబ్రిటీలు కూడా తాజాగా స్పందించడం జరిగింది. ముఖ్యంగా తండ్రీ కూతుర్ల రిలేషన్ మీద కూడా చాలామంది అసభ్యకరంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారని ఇటీవల హీరో సాయి ధరంతేజ్ కూడా తెలియజేశారు.

సోషల్ మీడియాలో చాలానే జంతువులు ఉన్నాయి తండ్రి కూతుర్ల ఫోటోలు వీడియోలు షేర్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా తెలియజేయడం జరిగింది. సోషల్ మీడియా ఒక క్రూరంగా మారిపోయింది చెత్త కామెంట్స్ చేసే వారు ఎక్కువ అయ్యారు. అలాంటి కామెంట్స్ చూసి ఎవరు తట్టుకోలేరు దయచేసి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి అంటూ తేజ్ సైతం తెలియజేశారు. అలాగే ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేస్తే చేసే వారిని శిక్షించాలి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిని కోరారు.. ఈ విషయం పైన రేవంత్ రెడ్డి కూడా స్పందించి తగిన నిర్ణయాలు తీసుకుంటామంటూ తెలిపారు.

అయితే తాజాగా వీడియోలో ఒక తండ్రి కూతుర్ల మీద జోక్స్ చేస్తూ చెత్త వాగుడు ఆగిన పి హనుమంతు అనే యూట్యూబ్  ఛానల్ లో కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు. ఈ వీడియోల పైన సెలబ్రిటీలు కూడా మండిపడడం జరిగింది.. చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదు అంటూ కూడా ఫైర్ అయ్యారు. తాజాగా నటి రేణు దేశాయ్ కూడా ఈ వ్యవహారం పైన ఫైర్ అయ్యింది.. రేణు దేశాయ్ ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఇలాంటి నీచులని మరింత దారుణంగా శిక్షించాలి.. ఇలాంటి చెత్త వాగుడు మాట్లాడకుండా చేయాలి.. వెంటనే ఇలాంటి వారిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో వేసి చితక్కొట్టాలి అంటూ తెలిపింది. రేణు దేశాయ్ తన instagram స్టోరీస్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: