అటువంటి పని చేసిన జెనీలియా, రితీష్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్..!

lakhmi saranya
జెనీలియా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒకప్పటి స్టార్ హీరోయిన్. చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాయ్స్ చిత్రంతో ఈ అమ్మడుకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక అనంతరం వరసగా సినిమాలు చేసింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెరిసింది. జెనీలియా పేరు చెప్తే గుర్తొచ్చే సినిమాల్లో బొమ్మరిల్లు ముందు ప్లేస్ లో ఉంటుంది. అదేవిధంగా సై, ఢీ, హ్యాపీ మరియు ఆరెంజ్ సినిమాల్లో కూడా తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది .
ఇక ఈ అమ్మడు బాలీవుడ్ హీరో రితీష్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే . వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . పెళ్లి అనంతరం జెనీలియా సినిమాలకు దూరమైంది . ఇటీవల వేద్ అనే ఓ మరాఠీ చిత్రంలో నటించింది . ఇక తాజాగా ఈ సెలబ్రిటీ జంట చేసిన పనికి ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు . జెనీలియా అండ్ తన భర్త అవయవ దానం చేశారు . ఇందుకుగాను ఆ దంపతులకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ కృతజ్ఞతలు తెలిపింది‌.

రితీష్ ఎందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు . అవయవ దానం ఎంతో గొప్పదానం . దీని వాళ్ళ వ్యక్తి మరణించిన తరువాత కాళ్లు మరికొన్ని అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయి . రితీష్ అండ్ జెనీలియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ‌. ఇక ఇంతకు ముందు రితీష్ మాట్లాడుతూ .." నేను అను జెనీలియా మా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం " అని తెలిపారు. ఇక ఈ విషయాన్ని జెనీలియా కూడా చెప్పింది . ప్రజెంట్ వీరి మాటలను నిజం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: