రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. లావణ్య కు నోటీసులు?

praveen
సినీ సెలెబ్రిటీల గురించి ఏ విషయం తెరమీదకి వచ్చిన అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే ఇక హీరో హీరోయిన్లు తమ పర్సనల్ విషయాలను కాస్త సీక్రెట్ గా పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ప్రొఫెషనల్ విషయాలను ఎలా అయితే అభిమానులతో పంచుకుంటారో.. ఇక పర్సనల్ విషయాలను మాత్రం ఎక్కడా బయటికి రాకుండా చూసుకుంటారు అని చెప్పాలి. ఇక ఇలా ఎంత జాగ్రత్త పడినప్పటికీ కొన్ని కొన్ని సార్లు సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలోకి వచ్చి రచ్చ రచ్చ చేస్తూ ఉంటాయి.

 మరీ ముఖ్యంగా సినీ సెలెబ్రెటీల ప్రేమ పెళ్లి బ్రేకప్లకు సంబంధించిన వార్తలు అయితే ఇక ఇంటర్నెట్ను షేక్ చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న రాజ్ తరుణ్ గురించి ఒక వార్త ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే అతని గురించి వైరల్ గా మారిపోయిన న్యూస్ గురించి తెలిసి రాజ్ తరుణ్ ఇలాంటి వాడా అని అందరూ అనుకుంటున్నారు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. గతంలో రాజ్ తరుణ్ తో ఒక సినిమా చేసిన నటి లావణ్య తనను రాజ్ తరుణ్ నమ్మించి మోసం చేశాడు అంటూ కేసు వేసింది.

 అంతేకాదు ఈ యంగ్ హీరో పై సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే లావణ్య కు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని.. అందుకే తనతో బంధాన్ని తెంచుకున్నాను అంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేయగా.. దీనికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని 91 సిఆర్పిసి కింద ఆమెకు నోటీసులు పంపారు అధికారులు. అయితే ఇప్పటివరకు లావణ్య మాత్రం పోలీసులకు అందుబాటులోకి రాలేదు అన్నది తెలుస్తుంది. అయితే లావణ్య తనపై చేసిన ఆరోపణలలో ఒక్క నిజం కూడా లేదు అంటూ రాజ్  తరుణ్ కామెంట్ చేశాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: