టాప్ హీరోయిన్స్ గా ఉంటూనే ఆ పని చేసింది కేవలం ఆ బ్యూటీలు మాత్రమే..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ స్థాయికి వెళ్లిన వారిలో చాలా మంది ఐటమ్ సాంగ్స్ లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ఎందుకు అంటే టాప్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయాలలో స్టార్ హీరోల సరసన ఆడి పడే అవకాశాలు వస్తూ ఉంటాయి. దానితో వారికి మరిన్ని అవకాశాలు రావడం , అలాగే భారీ రెమ్యూనరేషన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒక వేళ ఐటెం సాంగ్స్ లో నటించినట్లు అయితే వాటి తర్వాత స్టార్ హీరోల పక్కన సినిమా అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంటుంది.

ఆ తర్వాత కేవలం ఐటెం పాటలలో మాత్రమే అవకాశాలు వస్తే వారి కెరియర్ డౌన్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. అందువల్ల కొంత మంది స్టార్ హీరోయిన్స్ ఆ భయంతో ఐటమ్ సాంగ్ లలో నటించకుండా దూరంగా ఉంటారు. కానీ మరి కొంత మంది మాత్రం అటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తూనే ఇటు ఐటెం పాటలలో నటిస్తూ తమ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. అలాంటి వారిలో తమన్నా , పూజా హెగ్డే , కాజల్ అగర్వాల్ , సమంత ముందు వరుసలో ఉంటారు. తమన్నా స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తూనే ఎన్నో ఐటమ్ పాటలలో నటించి కెరియర్ ను రెండు విధాలుగా అద్భుతమైన జోష్ లో ముందుకు నడిపించింది.

ఇక పూజ హెగ్డే ఇప్పటికే రంగస్థలం , ఎఫ్ 3 సినిమాలలో ఐటెం పాటలలో నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇకపోతే కాజల్ అగర్వాల్ "జనతా గ్యారేజ్" మూవీ లో ఐటమ్ సాంగ్ లో నటించింది. సమంత "పుష్ప పార్ట్ 1" మూవీ లో ఐటెం పాటలో నటించింది. వీరంతా స్టార్ హీరోయిన్ లుగా కెరియర్ ను కొనసాగిస్తూనే ఐటెం పాటలలో కూడా నటించారు. కానీ వీరి స్టార్ హీరోయిన్ హోదాకు ఏ డ్యామేజ్ కాలేదు. అలాగే వీరు ఐటం పాటలతో కూడా ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: