రాజాసాబ్: మారుతీ కొంపముంచిన కల్కి?

Purushottham Vinay

నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీసిన కల్కి 2898 ఏడి మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్, 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.


కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ ప్రభాస్ చేయబోయే నెక్స్ట్ సినిమాల మీద ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న రాజా సాబ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కల్కి లో ప్రభాస్ ని చూసిన ఆడియన్స్ రాజా సాబ్ లాంటి సినిమాలో యాక్సెప్ట్ చేస్తారా అన్న డౌట్ మొదలైంది. ఐతే ఈ అంచనాలు సినిమాకు ఎంత మంచి చేస్తాయో అదే విధంగా చెడు కూడా చేస్తాయి.బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యాం సినిమాలతో నిరాశ పరిచిన ప్రభాస్ ఆ రెండు సినిమాల మీద ఉన్న అంచనాలను అందుకోకపోవడమే కారణమని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు కల్కి తర్వాత రాజా సాబ్ అంటూ రాబోతున్నాడు. అసలు టాలెంటే లేని రోట్ట డైరెక్టర్ మారుతి ప్రభాస్ ని ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అభిమానుల అంచనాలకు తగ్గట్లు మారుతీ సినిమా తీయకపోతే ఖచ్చితంగా సోషల్ మీడియాలో అతన్ని ఘోరంగా ట్రోల్ చెయ్యడం ఖాయం. ఇలా కల్కి సక్సెస్ మారుతీ కొంప ముంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: