మెగాస్టార్ 'విశ్వంభర' నుంచి స్టన్నింగ్ అప్డేట్.. వైరల్..?

murali krishna
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఖైదీ నంబర్ 150 వంటి బ్లాక్ బస్టర్ మూవీతో చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.గత ఏడాది యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.తన మాస్ యాక్టింగ్ తో ,కామెడీ టైమింగ్ తో మెగా స్టార్ ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే అదే ఏడాది వచ్చిన భోళా శంకర్ సినిమాతో మెగాస్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఆ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీనితో మెగా స్టార్ రీమేక్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు..ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు..
ఈ సినిమాలో  స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను అందించారు.ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని దర్శకుడు వశిష్ట సోషల్ మీడియా వేదికగా తెలిపారు.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా కనిపించనున్నాడని సమాచారం.. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా అదిరిపోయేలా ఉండబోతున్నాయని సమాచారం.. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటించబోతున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి  ఆస్కార్ విన్నర్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2025 జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మెగాస్టార్ బర్త్ డే కానుకగా మేకర్స్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: