మహేష్ - జక్కన్న మూవీలో.. విలన్ గా ఫిక్స్ అయిన స్టార్ హీరో..!

lakhmi saranya
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న సినిమాలలో జక్కన్న అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూవీ కూడా ఒకటి. గుంటూరు కారం చిత్రంతో సంక్రాంతి బరిలో దిగిన మహేష్ బాబు పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో తన తదుపరి చిత్రాన్ని స్ట్రాంగ్ వేలో చేసేందుకు సిద్ధపడ్డాడు. ఇక ఇదే క్రమంలో రాజమౌళి సైతం మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనుకోవడం ప్లస్ పాయింట్ గా మారింది.

యాక్షన్ అడ్వెంచర్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ లో అత్యంత భారీగా ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ కోసం మహేష్ తన లుక్ సైతం మార్చుకున్నాడు. బరువు పెరగడంతో పాటు హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేశాడు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాదిలో ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుండగా నటీనటుల ఎంపిక విషయంలో దృష్టి పెట్టాడు జక్కన్న.

ఈ క్రమంలోని ఈ సినిమాలో మహేష్ కు పోటీగా విలన్ పాత్రలో మలయాల్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. దాదాపు  పృథ్వీరాజ్ సుకుమారన్  ఖాయమైనట్లు కూడా   తెలుస్తుంది. కాగా పృథ్వీరాజ్ సుకుమారం ఇటీవల ది గోట్ లైఫ్ మూవీతో భారీ విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీలో డార్లింగ్ కి ప్రాణ స్నేహితుడిగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఈయనకి ఇదే తెలుగులో మొదటి సినిమా కూడా . తెలుగు లో ఎంట్రీ ఇస్తూనే సూపర్ హిట్ అందుకున్న పృథ్వీరాజ్ కి వరుస అవకాశాలు దక్కుతున్నాయి. వాటిలో జక్కన్న మూవీ కూడా ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: