ఆ తమిళ స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నిత్యా మీనన్..?

MADDIBOINA AJAY KUMAR
కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో విజయ్ సేతుపతి ఒకరు. ఈయన తన కెరియర్ ప్రారంభం అయిన నుండి ఇప్పటివరకు సినిమాలలో హీరో పాత్రలలో మాత్రమే కాకుండా విలన్ , కీలక పాత్రలలో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈయన ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు. ఈయన మొదట సైరా నరసింహా రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ తర్వాత ఉప్పెన సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు మహారాజా అనే తమిళ సినిమాలో నటించాడు.

ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అయింది. ఇక ఈ మూవీ కి తమిళ్ , తెలుగు రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. ఈ మూవీ తో విజయ్ సేతుపతికి అద్భుతమైన విజయం దక్కింది. ఇది ఇలా ఉంటే విజయ్ సేతుపతి ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ ని కూడా ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. పాండిరాజ్ డైరెక్ష‌న్ లో విజ‌య్ సేతుప‌తి తన నెక్స్ట్ మూవీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ దర్శకుడు ఈ సినిమాలో హీరోతో పాటు హీరోయిన్ కూడా ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని నిత్యా మీనన్ హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ బృందం నిత్య మీనన్ ను సంప్రదించి ఈ మూవీ కథను , అందులోని తన పాత్రను వివరించినట్లు , దానితో ఈ మూవీ కథ , అందులోని తన పాత్ర బాగా నచ్చడంతో నిత్యా మీనన్ , విజయ్ సేతుపతి హీరోగా రూపొందబోయే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే నిత్యా మీనన్ తన పాత్రకు ప్రాధాన్యత లేకుంటే సినిమా అసలు చేయదు. దానితో ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఈ సినిమాలో తన పాత్రకు కచ్చితంగా మంచి ప్రాధాన్యత ఉంటుంది అని చాలా మంది జనాలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: