సాధారణంగా ఏ సినిమా చేసిన కూడా దానికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు చేయడం తప్పనిసరి. అయితే ఈ విషయంలో ఎప్పుడూ భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది తమిళ స్టార్ నటి నయనతార. నయనతార ఈ నియమాలను ఎప్పుడూ పాటించదు. గత కొన్ని ఏళ్లుగా ఈమె ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది. ఎందుకు ఏంటి అన్నది తెలియదు కానీ ఈమె ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆమె చేసిన ఒక్క సినిమా ప్రమోషన్ కి కూడా ఇప్పటివరకు హాజరు కాలేదు. ప్రాజెక్ట్ ఓకే చేసే ముందే దర్శక నిర్మాతలకి తాను కండిషన్స్
పెడుతుంది. నేను ఎటువంటి ప్రచార కార్యక్రమాలకు రాను అని దర్శక నిర్మాతలకి చెప్పేస్తుంది. చిరంజీవి షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోస్ అయినప్పటికీ ప్రమోషన్స్ కి మాత్రం అస్సలు రాదు నయనతార. అయితే తాజాగా ఈ రూల్ ని బ్రేక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక నయనతార ఎందుకు ఈ రూల్ బ్రేక్ చేసింది ఏ సినిమా ప్రమోషన్స్ కి రాబోతోంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. తమిళ చిత్రం 'నేసిప్పయ' ప్రమోషనల్ ఈవెంట్లో ఆమె పాల్గొంది. విష్ణువర్ధన్ దర్శకత్వంలో అదితి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం
త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ మూవీ ప్రమోషన్లో నయనతార పాల్గొనడానికి ఓ కారణం ఉందట. విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన 'బిల్లా' చిత్రంతోనే నయనతార మంచి స్టార్డమ్ను సంపాదించుకుంది. పైగా దర్శకుడు విష్ణువర్ధన్ తన కుటుంబ సభ్యుడిలాంటివాడని, తన మీద అభిమానంతోనే ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నానని నయనతార పేర్కొంది. ఇదిలావుంటే తాజాగా 'మహారాజ'ఫేం మిథిలన్ సామినాథన్ చెప్పిన లేడీ ఓరియెంటెడ్ కథను నయన్ ఓకే చేసిందట. 'మహారాజ'తో విజయాన్ని అందుకున్న మిథిలన్తో సినిమా చేస్తుండటం పట్ల నయన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలా ప్రస్తుతం నయనతార కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!