టాలీవుడ్ కి కొత్త రూల్స్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇకపై అది మస్ట్..!

lakhmi saranya
పార్టీ మారింది.. కొత్త రూల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి.. ఇదే క్రమంలో మన టాలీవుడ్ కి కూడా కొన్ని కండిషన్స్ వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గంజాయి అండ్ డ్రగ్స్ వినియోగంపై మంగళవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లో పోలీసులకు సంబంధించి కొత్త వ్యవహారాలను ప్రారంభించారు. ఇక అనంతరం సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం జరిగింది. డ్రగ్ స్ నియంత్రణ పై హా అందరు తమ వంతు కృషి చేయాలని సూచించారు. ప్రమాదకరమైన గంజాయి బారిన పడి నేటితరం యువకులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కావున ఈ డ్రగ్స్ అండ్ గంజాయి నీ నియంత్రించడంపై ప్రభుత్వానికి టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తోడుండాలని కోరారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్ స్ నియంత్రణలో సినీ ఇండస్ట్రీ తమ సామాజిక మధ్యమాలను నెరవేర్చట్లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక సమాజం కోసం ఉపయోగపడే వీడియోలను సినిమా ముందు ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. థియేటర్లో యాజమాన్ యులు కూడా డ్రగ్స్ పై అవగాహన డాక్యుమెంటరీ వీడియోలను ప్లే చేయాలని ఆయన తెలిపారు.

టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం దగ్గరకు వచ్చే ప్రొడ్యూసర్స్ నటీనటులతో 1.5-2 వీడియో తీసుకొచ్చి ఇస్తేనే వారికి వెసులుబాటు ఇవ్వాలని అన్నారు. ఇక సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నారు. కొంతైనా తిరిగి ఇవ్వడం వారి బాధ్యత. సమాజాన్ని అడగడంలో వారు భాగస్వాములనే ఆయన తెలిపారు. ప్రజెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూసిన పలువురు.." అసలు డ్రగ్స్ అండ్ గంజాయి వంటివి సినీ సెలబ్రిటీలే సామాన్య మనుషులకి అలవాటు చేస్తున్నారు. ముందు వారిని అదుపులో పెడితే టోటల్ ఇండియా బాగుపడుతుంది. ఫస్ట్ సినీ ఇండస్ట్రీని బాగు చేయండి రేవంత్ సార్ " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: