అవును అలా చేసి జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశా.. సమంత షాకింగ్ కామెంట్స్..!?

Anilkumar
ఏడాది కాలం పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమంత మళ్ళీ ఇప్పుడిప్పుడే కెరియర్ను రీస్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తనకి సంబంధించిన ఒక కొత్త ప్రాజెక్టు సైతం అనౌన్స్ చేసింది సమంత. అలాగే ఆమె ఒప్పుకున్న పలు సినిమాలను కూడా స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఆ సినిమా తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఒకటి రెండు ప్రాజెక్టు లు అనౌన్స్ చేసినప్పటికీ అవి సైలెంట్ గానే ఉన్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా ప్రేక్షకులతో పెద్దగా టచ్ లో లేదు సమంత. అయితే సడన్గా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

 దీనితో ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆ మధ్యకాలంలో అనారోగ్య కారణాలతో బాధపడుతున్న సమంత ప్రస్తుతం తన ఆహారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తాను తినే విషయంలోనే కాదు తాను ప్రమోట్‌ చేసే ఫుడ్ విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నా అన్నారు సామ్‌. ఆరోగ్యకరమైన ఫుడ్‌కి మాత్రమే బ్రాండింగ్ చేస్తానని చెప్పారు. తనలా మరొకరు బాధపడకూడదన్న ఉద్దేశంతో సమంత తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు. అలా ప్రస్తుతం సమంత ఈ

 నిర్ణయం తీసుకోవడంతో ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత వరస సినిమాల్లో నటించింది. ఆ తరువాత టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది.. అలా రెండు మూడు సంవత్సరాలు బాగానే ఉన్నాయి దంపతులు కొన్ని ఊహించిన కారణాలవల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి కెరియర్లో వారు బిజీగా ఉన్నారు. అటు నాగచైతన్య సైతం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: