ఒకే నెలలో పని ప్రారంభించనున్న చరణ్.. తారక్.. ప్రభాస్.. తెలుగు సినీ అభిమానులకు అదిరిపోయే న్యూస్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన నటులలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. ప్రస్తుతం వీరు తమ తమ మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొన్ని సినిమాలలో నటిస్తున్న వీరు మరికొన్ని మూవీ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నారు. ప్రస్తుతం వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు సంబంధించిన దర్శకులు ఆ మూవీలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో అత్యంత బిజీగా ఉన్నారు. ఇక రామ్ చరణ్ ఇప్పటికే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన తదుపరి మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.

ఈ మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించనుండగా శివరాజ్ కుమార్ ఈ మూవీ లో ఓ కీ ఎంలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. ఇకపోతే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ను సెప్టెంబర్ నుండి మొదలు పెట్టే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.

ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ కూడా సెప్టెంబర్ నెల నుండి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హను రాగవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చేస్తున్నాడు. ఈ మూవీ ఈ యొక్క రెగ్యులర్ షూటింగ్ కూడా సెప్టెంబర్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ముగ్గురు హీరోల నెక్స్ట్ మూవీ లు కూడా సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: