నాగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ డిలే అందుకే.. ఈ న్యూస్ తెలిస్తే ఫ్యాన్స్ ఖుషి..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆఖరుగా ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ అయినటువంటి విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీలో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించగా ... ఆశకా రంగనాథ్ ఈ మూవీలో హీరోయిన్గా నటించింది. నాజర్ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించగా , ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా యొక్క షూటింగ్ ను సంక్రాంతి కి మూడు , నాలుగు నెలల ముందే మొదలు పెట్టారు. పక్క ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ను మొదలు పెట్టి అంతే ప్లానింగ్ తో ఈ మూవీ యొక్క షూటింగ్ను పూర్తి చేస్తూ వచ్చి అనుకున్నట్లు గానే ఈ మూవీ ని సంక్రాంతి కి విడుదల చేశారు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. తక్కువ రోజుల్లో ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేయడం , అనుకున్న సమయానికి ఈ మూవీ విడుదల కావడంతో ఈ సినిమా ద్వారా పెద్ద మొత్తంలో నిర్మాతలకు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక నా సామి రంగ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది.

అయిన నాగార్జున తదుపరి మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. దానితో ఆయన అభిమానులు అంతా నిరుత్సాహ పడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున ప్రస్తుతం తన తదుపరి మూవీ కోసం అనేక కథలను వింటున్నట్లు , కానీ అవి ఏవి అంత తృప్తిని ఇవ్వడం లేదు అని , ఏదైనా ఒక మంచి కథ దొరికినట్లు అయితే వెంటనే సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఒక వేళ సినిమా స్టార్ట్ అయితే నా సామి రంగ మూవీ లాగానే దీనిని కూడా అత్యంత స్పీడుగా పూర్తి చేసి విడుదల చేయాలి అనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: