మొదటిసారి అలాంటి రిస్క్ చేస్తున్న సుధీర్ బాబు. ఈసారి ఏకంగా పాన్ ఇండియా మూవీనే..!?

Anilkumar
హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. నవ దళపతి అనే పేరు తెచ్చుకున్న ఈయన ఇటీవల నటించిన "హరోం హర" మూవీ సాలిడ్ హిట్ ను అందుకుంది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో సుధీర్ నటించిన పాత్రకు అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో ఈయన నటించబోతున్న నెక్స్ట్ సినిమాపై మరింత ఫోకస్ పెట్టాడు. అయితే తాజాగా ఈయన ఓ పాన్ ఇండియా సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల  ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారట. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో రుస్తుం, టాయ్‌లెట్‌: ఏక్ ప్రేమ్

 క‌థ‌, ప్యాడ్ మ్యాన్ వంటి బ్లాక్ బస్ట‌ర్ హిట్ సినిమాలు నిర్మించిన ప్రేర‌ణ అరోరా, శివిన్ నార‌గ్‌, నిఖిల్ నంద‌, ఉజ్వ‌ల్ ఆనంద్ నిర్మాతలుగా ఓ సూపర్ నాచురల్ మిస్టరీ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమానుతో వెంకట్ కళ్యాణ్ ఇండస్ట్రీకి మరో కొత్త దర్శకుడిగా పరిచయం అవుతుండగా  సుధీర్ బాబు ఈ చిత్రంలో హీరోగా నటించబోతున్నారట. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట నిర్మాతలు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి

 ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. అంతేకాకుండా బాలీవుడ్ హీరోయిన్ దీంట్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. అంతే కాకుండా ఈ సినిమాను 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. 
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను 2024 ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు. ఈ పాన్-ఇండియా థ్రిల్లర్ ఆధ్యాత్మిక రహస్యాలు, అద్భుతమైన విజువల్స్ మరియు స్టార్ స్టడెడ్ కాస్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందట.
ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా టీమ్ తో ఏడాది నుంచి ట్రావెల్ అవుతున్నాను. చాలా కొత్త కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్ష‌క‌ల ముందుకు ఎప్పుడు తీసుకురావాలా అని ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: