ఆ ఇద్దరు హీరోలు అంటే దీపికాకు చాలా ఇష్టమట.. వారెవరో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో దీపికా పదుకొను ఒకరు. ఈమె షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన ఓం శాంతి ఓం అనే హిందీ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో దీపికా కి హిందీలో అవకాశాలు పెరిగాయి. దానితో ఈ బ్యూటీ అప్పటి నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గానే కెరియర్ ను కొనసాగిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయంలోనే దీపికా హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక వీరి పెళ్లి అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న వీరి జీవితం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతుంది. మధ్యలో కొన్ని సార్లు వీరి మధ్యలో మనస్పర్ధలు రావడంతో వీరి విడిపోతున్నారు అని వార్తల కూడా వచ్చాయి. కానీ వాటిని ఈ జంట కొట్టి పారేసింది. ప్రస్తుతం దీపిక కడుపుతో ఉంది. మరో కొన్ని నెలల్లోనే రన్వీర్ , దీపిక ఓ పండంటి బిడ్డకు తల్లి దండ్రులు కాబోతున్నారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది.

ఈ మూవీ జూలై 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కనుక మంచి విజయం సాధిస్తే దీపికా క్రేజ్ మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. ఇకపోతే ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో ఇద్దరు హీరోలు అంటే చాలా ఇష్టమట. వారెవరో కాదు ఒకరు మహేష్ బాబు , మరొకరు దగ్గుపాటి రానా. వీరిద్దరూ అంటే తనకు ఎంతో ఇష్టం అని ఈ బ్యూటీ తాజాగా చెప్పుకొచ్చింది. ఇకపోతే రానా తో ఈమెకు మంచి స్నేహం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: