"కల్కి" కి వచ్చిన తిప్పలపై క్లారిటీ ఇచ్చిన "బుక్ మై షో"..?

murali krishna
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం జూన్ 27న రిలీజ్ అవుతోంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళుతుందని అంతా భావిస్తున్నారు. మహాభారతాన్ని, సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేసి నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.కల్కి 2898 ఏడీ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్‍లు మొదలయ్యాయి.ఈ తరుణంలో హైదరాబాద్‍లో నేడు (జూన్ 23) ఆన్‍లైన్ టికెట్ల బుకింగ్స్ మొదలయ్యాయి. భారీ రేంజ్‍లో క్రేజ్ ఉండటంతో కొన్ని థియేటర్లు నిమిషాల్లోనే హౌస్ ఫుల్ అయ్యాయి. అయితే, టికెట్ల బుకింగ్ ప్లాట్‍ఫామ్ 'బుక్‍మైషో'లో ఓ కన్‍ఫ్యూజన్ నెలకొంది. సీనియర్ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి టికెట్లను కొందరు బుక్ చేసుకున్నారు. అయితే, ఈ విషయంపై బుక్‍మైషో క్లారిటీ ఇచ్చింది.
కల్కి 2898 ఏడీ సినిమా టికెట్ల బుకింగ్స్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఓపెన్ కాగానే చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, హైదరాబాద్‍లోని కొన్ని థియేటర్లలో రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం కూడా కనిపించింది. దీంతో కన్‍ఫ్యూజన్ క్రియేట్ అయింది. టికెట్లు బుక్ అయిన తర్వాత అది రాజశేఖర్ 'కల్కి' అని చూసుకొని కొందరు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బుక్‍మైషోకు ట్యాగ్ చేశారు.
ఈ కన్‍ఫ్యూజన్‍పై బుక్‍మైషో ప్లాట్‍ఫామ్ స్పందించింది. రాజశేఖర్ కల్కి సినిమాకు టికెట్లు బుక్ చేసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారికి కల్కి 2898 ఏడీ సినిమా టికెట్లు కన్‍‍ఫామ్ అయినట్టేనని క్లారిటీ ఇచ్చింది. ఈ సమస్యను త్వరలోనే ఫిక్స్ చేస్తామని  పోస్ట్  చేసింది. మొత్తంగా రాజశేఖర్ కల్కి బుక్ చేసుకున్న వారికి కూడా కల్కి 2898 ఏడీ టికెట్లు ఉన్నట్టేనని చెప్పింది. దీంతో గందరగోళానికి తెరపడింది.ప్రభాస్ కల్కి 2898 ఏడీ కాకుండా రాజశేఖర్ 'కల్కి' టికెట్లను ప్రజలు బుక్ చేసుకున్నారని, భ్రమరాంబ థియేటర్లలో 6 షోలు ఫుల్ అయ్యాయని ఓ పోస్ట్ అయింది. దీనికి రాజశేఖర్ సరదాగా స్పందించారు. కల్కి టీమ్‍కు విషెస్ కూడా చెప్పారు. "నాకు అసలు సంబంధం లేదు. జోక్స్ పక్కన పెడితే.. ప్రభాస్, నాగ్అశ్విన్, అశ్వినీదత్ సహా కల్కి టీమ్ అందరికీ బెస్ట్ విషెస్. చరిత్ర సృష్టించి, మూవీ ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కించాలని ఆకాంక్షిస్తున్నా" అని రాజశేఖర్ పోస్ట్ చేశారు.కల్కి 2898 ఏడీ సినిమాకు ఓ దశలో గంటకు ఏకంగా బుక్‍మైషో ప్లాట్‍ఫామ్‍లో గంటకు 60వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ మూవీకి ఏ రేంజ్‍లో క్రేజ్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు సహా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కల్కి 2898 ఏడీ టికెట్ల బుకింగ్స్ మొదలయ్యాయి. ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన వెంటనే ఆ రాష్ట్రంలోనూ బుకింగ్స్ షురూ అవుతాయి. మరికొన్ని గంటల్లోనే జీవో వచ్చే అవకాశం ఉంది.ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా కొందరు స్టార్ యాక్టర్ల క్యామియోలు కూడా ఈ మూవీలో ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్‍తో నిర్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: