ఆ విషయంలో నా కుటుంబమే నాకు అడ్డు... తన ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు లక్ష్మి..!

Pulgam Srinivas
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని హాలీవుడ్ ప్రాజెక్టులో నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె  సిద్ధార్థ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందిన అనగనగా ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ తో ఈమెకు మంచి గుర్తింపు లభించింది.

ఈ సినిమా తర్వాత ఈమె పలు సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో, టీవీ, ఓ టి టి షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలోనే ఈమె హైదరాబాద్ నుండి ముంబై కి మఖం మార్చేసింది. అలా మార్చడానికి గల కారణాలను, అలా మార్చే ప్రాసెస్ లో ఆమెకు ఎదురైన పరిణామాల గురించి మంచు లక్ష్మి తాజా ఓ ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది. తాజాగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ... నేను హైదరాబాదు నుండి కొన్ని రోజుల క్రితమే ముంబైకి వెళ్లాను. అందుకు ప్రధాన కారణం ఇక్కడ కంటే అక్కడ మంచి అవకాశాలు వస్తాయి అని ఉద్దేశమే. ఇక నేను అలా హైదరాబాదు నుండి ముంబై కి వెళ్లే సమయంలో నా కుటుంబమే నాకు అడ్డుగా నిలిచింది.

హైదరాబాదులో ఆఫర్లు రావడం లేదు అని ముంబైకి వెళదాము అని నేను అనుకుంటే దానికి మా కుటుంబ సభ్యులు అస్సలు ఒప్పుకోలేదు. వాళ్ళు నన్ను అస్సలు ముంబైకి వెళ్ళకూడదు అని చెప్పారు. వారు నన్ను చూడకుండా అసలు ఉండలేరు. అందుకే నన్ను ముంబైకి పంపడానికి వారు ఇష్టపడలేదు. మేము ఎంతో క్లోజ్ గా ఉంటాం. అందుకే మేమంతా ఒకరిని విడిచి ఒకరం ఉండలేము. అందుకే నన్ను ముంబైకి పంపించడానికి మా కుటుంబం వారు ఒప్పుకోలేదు. ఎలాగోలాగా నేను వారిని ఒప్పించి నేను ముంబైకి వెళ్లాను అని మంచు లక్ష్మి తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: