సాయి ధరమ్ తేజ్ వదులుకున్న ఆ రెండు బ్లాక్ బాస్టర్ మూవీలు ఏవో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈ నటుడు తన కెరియర్లో కొన్ని బ్లాక్ బాస్టర్ మూవీలను కూడా వదులుకున్నాడు. అలా ఈ నటుడు వదులుకున్న ఆ బ్లాక్ బాస్టర్ మూవీలు ఏవి..? అవి ఎందుకు వదులుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.
శర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా శతమానం భవతి అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా కథ మొత్తం రెడీ అయిన తర్వాత దిల్ రాజు దీనిని మొదటగా సాయి ధరమ్ తేజ్ కు వినిపించారట. కాకపోతే ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ ఇతర మూవీలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా చేద్దాం సార్ కాకపోతే కొంచెం టైమ్ పడుతుంది అని చెప్పాడట. దానితో దిల్ రాజు ఈ సినిమాను కచ్చితంగా సంక్రాంతి కి విడుదల చేయాలి అనుకుంటున్నాం. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలి అంటే ఇప్పుడే షూటింగ్ మొదలు పెట్టాలి. నీకు వేరే సినిమాలు ఉన్నాయి అంటున్నావు.

అలాగే ఈ సంక్రాంతి సీజన్ కి ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ కి ఉంది. దానికి పోటీగా నువ్వు సినిమా రిలీజ్ చేయవు. మనిద్దరం వేరే సినిమా చేద్దాం. ఇప్పుడు దీనిని వదిలేద్దాం అని చెప్పాడట. దానితో ఈ నటుడు ఈ సినిమాను వదిలేసాడట. ఇక కార్తికేయ హీరోగా పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ఎక్స్ 100 అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కథను మొదటగా అజయ్ , సాయి ధరమ్ తేజ్ కు వినిపించాడట. ఈ కథ మొత్తం విన్న ఈ నటుడు ఇంత రఫ్ పాత్ర నేను చేయలేను సారీ అని చెప్పాడట. అలా సాయి ధరమ్ తేజ్ ఈ రెండు బ్లాక్ బాస్టర్ మూవీలను వదులుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

sdt

సంబంధిత వార్తలు: