సైలెంట్ గా ఆ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన "గం గం గణేశా"..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు ఆనంద్ దేవరకొండ కొంత కాలం క్రితం గం గం గణేశా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మంచి అంచనాల నడుమ మే 31 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ పెద్ద స్థాయిలో థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ కి రిలీజ్ అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి పెద్ద మొత్తం లో కలెక్షన్ లు రాలేదు.

ఇక చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అందుకోవడంలో విఫలం అయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి సైలెంట్ గా వచ్చేసింది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఎలాంటి ప్రచారం లేకుండా సడన్ గా ఈ సినిమాని ఈ రోజు నుండి తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

మరి థియేటర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓ టీ టీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాలో థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీ కి ఉదయ్ బొమ్మశెట్టి దర్శకత్వం వహించగా , హైలైఫ్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో కేదార్ సెలగంశెట్టి తో కలిసి వంశీ కారుమంచి ఈ మూవీని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ad

సంబంధిత వార్తలు: