ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లు వస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. మొట్టమొదటిసారిగా వీళ్లిద్దరు కామెడీ విషయంలో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే దీనిపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇకపోతే ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా కనిపించబోతోంది. ఆమెతోపాటు అమితాబచ్చన్ కమలహాసన్ వంటి స్టార్ లు ఇందులో పలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. యు/ఏ సర్టిఫికెట్తో 2 గంటల 55 నిమిషాల రన్టైమ్తో సర్టిఫై
చేసింది సెన్సార్ బృందం. ఇక సెన్సార్ టాక్ అంటూ కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. వాటిలో నిజమెంత, ఎవరు చెప్పారు అనేది తెలియదు కానీ..ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లు వస్తున్న సినిమాలో ఊహించని ట్విస్ట్లు, సస్పెన్స్లు ఉన్నాయట. అలాగే భైరవ పాత్రలో ప్రభాస్ అదరగొట్టారట అనే రెగ్యులర్ పొగడ్త కూడా సెన్సార్ టాక్లో వినిపిస్తోంది. సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్తో రూపొందింది అని చెబుతున్న ఈ సినిమాను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఈ మేరకు లైట్ ప్రచారం చేస్తున్న చిత్రబృందం బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. తెలుగు
మీడియాకు వీడియో బైట్లు రిలీజ్ చేస్తోంది. ఇకపోతే ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లు వస్తున్న సినిమా విడుదలకి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రమోషన్స్ కోసం ముంబైకి కూడా వెళ్లారట చిత్ర బృందం. అందులో ప్రభాస్ కూడా ఉండడం విశేషం. ముందు చాలా సైలెంట్ గా దీన్ని ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటికీ ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే డైరెక్టర్ సైతం ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లు వస్తున్న సినిమా ప్రమోషన్స్ని ఎన్నడు లేని విధంగా చేసే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది..!!