పుష్ప మేకర్స్ చేసిన పనికి కోపంగా ఉన్న రష్మిక... ఈమె కెరీర్ కే గట్టి దెబ్బ తగలనందా..?

Pulgam Srinivas
నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీలో హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలోని రష్మిక నటనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమా విజయం తర్వాత ఈమెకు తెలుగుతో పాటు హిందీలో కూడా వరుసగా సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. ఇక పుష్ప పార్ట్ 2 మూవీ ని చాలా రోజుల క్రితమే ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమా నుండి టీజర్, రెండు పాటలను కూడా మేకర్స్ విడుదల చేయడంతో ఈ సినిమా ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీన విడుదల అవుతుంది అని చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు ఆగస్టు 15 వ తేదీ వరకు పూర్తి కావు అనే నేపథ్యంలో ఈ సినిమాని ఆగస్టు నుండి ఏకంగా డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వారు ప్రకటించారు. దీనితో ఎక్కడలేని చిక్కు రష్మిక మందనకు వచ్చింది. ఎందుకు అంటే ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ నటుడు అయినటువంటి విక్కీ కౌశల్ హీరోగా రూపొందుతున్న చావా అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ని కూడా ఎప్పటినుండో డిసెంబర్ 6 వ తేదీనే విడుదల చేయాలి అని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాను కూడా డిసెంబర్ 6వ తేదీన విడుదల చేసినట్లు అయితే తాను నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాస్ అవుతాయి. అని దాని వల్ల ఒక సినిమాపై ప్రభావం మరో సినిమాపై పడి ఏ సినిమా ప్రేక్షకులను అలరించకపోయినా తన కెరీర్ కు నష్టం కలుగుతుంది అనే టెన్షన్ లో రష్మిక ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ బ్యూటీ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయినట్లు అయితే అందులో ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందో దేని ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: