సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'తెలుగు ఇండియన్ ఐడల్' సీజన్ 3?

Chakravarthi Kalyan
ఇండియన్ బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్' సీజన్ 3 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన సీజన్ 3 మోస్ట్ పాపులర్ ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమ్ అవుతోంది. సెన్సేషనల్ కంపోజర్ ఎస్ ఎస్ తమన్, స్టార్ సింగర్స్, కార్తిక్, గీతా మాధురి జడ్జస్ గా వ్యహరించే ఈ మెగా మ్యూజికల్ షో లాంచింగ్ ఎపిసోడ్స్ ప్రస్తుతం టాప్ ట్రెండ్ లో కొనసాగుతున్నాయి.  

ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర హోస్ట్ చేస్తున్న ఈ మ్యాసీవ్ మ్యూజికల్ కాంపిటేషన్ షోలో దేశ, విదేశాల నుంచి పాల్గొన్న ట్యాలెంటెడ్ కంటెస్టెంట్స్ తమ మెస్మరైజింగ్ వోకల్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. తొలి రెండు ఆడిషన్ ఎపిసోడ్స్ ఈ షో పై వున్న అంచనాలు మరింతగా పెంచాయి. తొలి ఎపిసోడ్ మెలోడీ బ్రహ్మమణి శర్మ ఎవర్ గ్రీన్ మెలోడీ ఈ శతమానం అన్నదిలే పాటతో మ్యూజికల్ ట్రీట్ గా ప్రారంభమైయింది. ఈ పాటకు గోల్డెన్ మైక్ తో పాటు తమన్ నుంచి స్టంప్ అందుకుంది కంటెస్టెంట్ కీర్తి. తర్వాత వచ్చిన కంటెస్టెంట్స్ కూడా అద్భుతమైన గానంతో అలరించారు.

సెకండ్ ఎపిసోడ్ లో తన వైబ్రెంట్ వోకల్స్ తో జడ్జస్ ని మైమరపించిన అనిరుద్ సుస్వరం గోల్డెన్ మైక్ ని తో పాటు పెర్ఫార్మర్ అఫ్ ది వీక్ గా నిలిచాడు. అనిరుధ్ సుస్వరన్ ఇప్పటికే చావు కబురు చల్లగా సినిమాలో పాట పాడాడు. తనను తాను నిరూపించుకోవడానికి తెలుగు ఇండియన్ ఐడల్‌కి వచ్చాడు. శ్రీ ధుతి.. గత సీజన్‌కు వచ్చింది కానీ ఎంపిక కాలేదు. ఆమె తండ్రి మరణం తనని కలిచివేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ షోలోకి రావాలనేది తన తండ్రి కల. ఇప్పుడా కలని నెరవేర్చడానికి షోలోకి వచ్చింది. ఆమె పాడిన తలచి తలచి పాట  జడ్జస్ ని మెప్పించింది.

హైలీ మ్యాజికల్ గా సాగిన లాంచింగ్ ఎపిసోడ్స్ చూస్తుంటే సీజన్ 3 డబుల్ ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ ఉండబోతోందని అర్ధమౌతోంది. మొత్తానికి లాంచింగ్ ఆడిషన్ ఎపిసోడ్స్ గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.   అందరి ఫేవరేట్ 'తెలుగు ఇండియన్ ఐడల్' సీజన్ 3 'ఆహా'లో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: