ఎట్టకేలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన సంతోష్ శోభన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సంతోష్ శోబాన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలలో హీరోగా నటించాడు. అందులో ఏక్ మినీ ఖాతా మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాకపోతే ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ నటుడు వరుసగా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నా అందులో ఏ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడం లేదు.

ఇకపోతే ఈ నటుడు కొంత కాలం క్రితం కళ్యాణం కమనీయం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి ప్రియ భవాని శంకర్ హీరోయిన్ నటించగా ... అనిల్ కుమార్ అల్లా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదల అయింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన సీజన్ లో ఓ పక్క బాలకృష్ణ హీరో గా రూపొందిన వీర సింహా రెడ్డి , మరో పక్క చిరంజీవి హీరో గా రూపొందిన వాల్టేరు వీరయ్య సినిమాలు కూడా విడుదల కావడంతో ఈ మూవీ ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ప్రభావం చూపలేదు. ఆ తర్వాత చాలా తక్కువ రోజుల్లోనే ఈ మూవీ ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి సంవత్సరం అవుతున్న బుల్లి తెరపై ప్రసారం కాలేదు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే జీ తెలుగు ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: