ఆ ఎపిసోడ్ తో షురూ కానున్న సికిందర్ ఫస్ట్ షెడ్యూల్..?

Pulgam Srinivas
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ , ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం మురుగదాస్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందను ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు.

ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరడంతో ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను మరికొన్ని రోజుల్లోనే మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ బృందం ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ మూవీ యొక్క చిత్రీకరణను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ యాక్షన్ ఎపిసోడ్ ను 33 వేల అడుగులో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం మేకర్స్ భారీగా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే మురగదాస్ కూడా ఈ ఎపిసోడ్ ను అత్యంత గ్రాండ్ గా సూపర్ గా తెరకెక్కించేందుకు కావలసిన అన్ని పనులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ కొంత కాలం క్రితం టైగర్ 3 అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక మురుగదాస్ ఆఖరుగా దర్బార్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరో గా రూపొందుతున్న సినిమాకు ఈయన దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: