ఆషోతో బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తున్న అనసూయ..?

Pulgam Srinivas
యాంకర్ కం నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో ఓ ప్రముఖ చానల్లో న్యూస్ రీడర్ గా పని చేసేది. కానీ ఆ సమయంలో ఈమెకు పెద్దగా ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈమె ఈటీవీ లో ప్రసారం అయినటువంటి జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో సూపర్ డూపర్ సక్సెస్ కావడం , ఇందులో అనసూయ తన యాంకరింగ్ తో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈమెకు బుల్లి తెర అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది.

ఆ తర్వాత ఈమెకు వరసగా షో ల సంఖ్య కూడా పెరిగింది. అలాంటి సమయం లోనే ఈమెకి సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. ఇకపోతే ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడం , ఈమెకు ఆ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపు దక్కడంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా భారీగా పెరిగాయి. కొంత కాలం క్రితం ఈమె పుష్ప పార్ట్ 1 అనే పాన్ ఇండియా మూవీ లో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

దానితో ఈమెకు ఇతర భాష సినిమాల్లో అవకాశాలు రావడంతో ఈమె ఫుల్ బిజీ అయింది. దానితో యాంకరింగ్ రంగానికి స్వస్తి చెప్పింది. ఇక మళ్లీ ఈ బ్యూటీ యాంకరింగ్ రంగం లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. కాకపోతే జబర్దస్త్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వట్లేదు. మరికొన్ని రోజుల్లోనే స్టార్ మా చానల్లో సరికొత్త కార్యక్రమం ప్రసారం కాబోతోంది. కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ పేరుతో ఈ షో మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ షో కి అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఇందులో ఈమె చాలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో మెరిసిపోనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: