ఎద అందాలతో.. అతడితో అలా.. సురేఖావాణి లేటెస్ట్ పోస్ట్..??

murali krishna
టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అత్తగా, పిన్నిగా, తల్లిగా, వదినగా, అక్కగా ఇలా పలు క్యారెక్టర్స్‌లో కనిపించి హీరోయిన్ అంత పాపులారిటీ తెచ్చుకుందనడంతో అతిశయోక్తి లేదు.అంతేకాకుండా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసి ఫుల్ క్రేజ్ తన సొంతం చేసుకుంది. అయితే సురేఖా వాణి గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైంది. కానీ ఇటీవల తన కూతురు సుప్రితను హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ అమ్మడు బిగ్‌బాస్ అమర్ దీప్ సరసన ఓ మూవీ చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అయితే సురేఖా వాణి మాత్రం కూతురు బాగోగులు చూసుకుంటే ఇంట్లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫొటోలు షేర్ చేసి కూతురిని మించిన అందంతో కుర్రాళ్లకు కట్టిపడేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సురేఖావాణికి సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారంతా సెలబ్రేట్ చేసుకుంటున్న పార్టీకి వెళ్లిన ఫొటోను నెట్టింట పెట్టి అవాక్కయ్యేలా చేసింది. అంతేకాకుండా ఈ పార్టీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫ్రెండ్ ఒర్రీతో అత్యంత సన్నిహితంగా ఫొటో దిగింది.పింక్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలు చూపిస్తూ ఒర్రీని పట్టుకుని నవ్వుతూ పోజు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అందులో టాలీవుడ్ నటి సురేఖా వాణి ఫొటోపైనే అందరి దృష్టి పడింది. దానికి కారణం.. ఈ పార్టీలో అందరూ బాలీవుడకు చెందిన సెలబ్రిటీలు మాత్రమే ఉన్నారు. టాలీవుడ్‌కు చెందిన వారు సురేఖా వాణి తప్ప మరెవరు లేరు. దీంతో ఈ పిక్ చూసిన వారంతా ఆమెకు అక్కడేం పని అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 46 ఏళ్ల వయసులో సురేఖావాణి షాకిచ్చిందని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోందో లేక కూతురికి అవకాశాలు ఇవ్వాలని వారితో కలిసి పార్టీ చేసుకుందోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: