విజయ్ సేతుపతి "మహారాజా" నైజాం హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
తమిళ నటుడు విజయ్ సేతుపతి తాజాగా మహారాజా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాని జూన్ 14 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో కూడా ఈ సినిమాను మహారాజా అనే టైటిల్ తోనే విడుదల చేయనున్నారు . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు.
 

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన నైజాం ఏరియా థియేటర్ హక్కులను అమ్మి వేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా విడుదల చేశారు. ఈ మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

విజయ్ సేతుపతి నటించిన ఎన్నో తమిళ మూవీ లు తెలుగు లో డబ్ అయ్యి టాలీవుడ్ లో విడుదల అయ్యి మంచి విజయాలను సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే ఈయన కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించడంతో ఈ నటుడికి తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉంది. దానితో మహారాజా మూవీ కి కనుక మంచి టాక్ వచ్చినట్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్ లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: