ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్..?

Pulgam Srinivas
టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత హీరోయిన్గా నటించగా , మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో సాయి శ్రీనివాస్ కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈయనకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది.

ఇకపోతే ఇప్పటివరకు ఈయన చాలా సినిమాలలో హీరోగా నటించగా రాక్షసుడు సినిమా ఈయనకు అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందించింది. కొంతకాలం క్రితం ఈ నటుడు తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన చత్రపతి మూవీ ని హిందీ లో రీమిక్ చేశాడు , కానీ ఈ సినిమా ఈయనకు సరైన విజయాన్ని అందించలేదు. ప్రస్తుతం ఈ నటుడు భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న టైసన్ నాయుడు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఓ ఫ్లాప్ దర్శకుడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కొంత కాలం క్రితం కార్తికేయ హీరోగా చావు కబురు చల్లగా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ థియేటర్లో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ మూవీకి దర్శకత్వం వహించిన కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ ఓ మూవీ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: