ఫస్ట్ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్స్ వీరే..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి సినిమాతో గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఆ తర్వాత ఫుల్ క్రేజీ సినిమా అవకాశాలను దర్శించుకుంటున్నారు. అలాంటి ముద్దుగుమ్మలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది ఉన్నారు. వారు ఎవరో తెలుసుకుందాం. సమంత , నాగ చైతన్య హీరోగా రూపొందిన ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ తో సమంత మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఈ సినిమా తర్వాత ఈమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కడం , అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇక కొన్ని రోజుల క్రితం కృతి శెట్టి పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఉప్పెన అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకొని మొదటి మూవీ తోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ కి వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ మూవీ అవకాశాలు దక్కుతున్నాయి.

మృనాల్ ఠాకూర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సీత రామం అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. ఈ ముద్దుగుమ్మలతో పాటు మరి కొంత మంది కి కూడా మొదటి సినిమాతోనే మంచి విజయాలు దక్కి , ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారు అనేక మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: