తనను కొట్టిన కానిస్టేబుల్ కి మద్దతిచ్చిన వారు.. దానికి మద్దతు తెలిపినట్లే... కంగనా..!

Pulgam Srinivas
ఎన్నో హిందీ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును నటిగా సంపాదించుకున్న కంగనా రనౌత్ తాజాగా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈమె బి జె పి పార్టీ నుండి ఎంపీ గా పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా సినిమా ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ అయిన ఈమె మొదటి సారి ఎలక్షన్ లలో పోటీ చేసి ఎంపీ గా కూడా గెలిచి పొలిటికల్ లో గా కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఇకపోతే కొన్ని రోజుల క్రితం చండీగఢ్ విమానాశ్రయం లో కంగనా ను ఒక (సి ఐ ఎస్ ఎఫ్) కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా కంగనా ను చంప దెబ్బ కొట్టడం పై కొందరు పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉండడంతో కంగనా తాజాగా చాలా ఘాటుగా స్పందించింది. తాజాగా కంగనా స్పందిస్తూ ... ఒక వ్యక్తి అనుమతి లేకుండా తన శరీరం తాకడాన్ని సమర్థించే వారందరూ హత్యాచారం లేదా హత్య చేసిన వారికి కూడా మద్దతు ఇస్తారు.

ఇలాంటి వారు తమ మానసిక స్థితిని పరిశీలించుకోవాలి. వీరు యోగా , ధ్యానం చేయాలి. లేదంటే జీవితం చేదుగా , భారంగా మారుతుంది. దయచేసి పగ , ద్వేషం , అసూయతో ఉండకండి అని ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ చేసింది. ఇక కంగనా తాజాగా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే కంగనా ను చండీగఢ్ విమానాశ్రయం లో ఓ (సి ఐ ఎస్ ఎఫ్) కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టడంతో పలువురు ఆ కొట్టిన వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపించారు. దానితో తాజాగా కంగనా ఇలాంటి పోస్ట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: