అకిరా మోధీని కలవడం పై స్పందించిన రేణు దేశాయ్..!

Pulgam Srinivas
సినీ నటుడు , రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ , సినీ నటి రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరికీ ఒక అమ్మాయి , ఒక అబ్బాయి సంతానం కూడా ఉంది. ఇక పెళ్లి , ఆ తర్వాత ఇద్దరి సంతానం తర్వాత వీరిద్దరూ మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో పరస్పర అంగీకారంతో విరు విడిపోయారు. ఇక వీరి కుమారుడు అయినటువంటి అకీరా ఇటు తండ్రితోనూ , అటు తల్లితోనూ కలిసి ఉంటూ వస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే 2024 వ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో జనసేన పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ఒక్క సారిగా జనసేన పార్టీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇకపోతే ఈ సారి ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగు దేశం మరియు బీ జే పీ తో పొత్తు పెట్టుకుంది. దానితో జనసేన అద్భుతమైన విజయాన్ని సాధించడంతో విజయం అనంతరం పవన్ కళ్యాణ్ తన కుమారుడు అలిర మరియు తన ప్రస్తుత భార్యతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవడానికి ఢిల్లీ కి వెళ్లి అక్కడ మోదిని కలిశారు.

ఇకపోతే అకీరా కూడా మోదిని కలవడంపై రేణు దేశాయ్ స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కన తన కుమారుడు అకీర నంద ను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అని , నాకు మొదటి నుండి బి జె పి అంటే అభిమానం అని , మోదీని కలిసిన వెంటనే అకిరా నాకు ఫోన్ చేసి చెప్పాడు. మోడీ చాలా గొప్పవారు అని , ఆయన చుట్టూ పాజిటివ్ వైబ్ ఉంటుందని అన్నాడు. అకీరా మాటలు విన్నంత సేపు నేను ఆనందంలో మునిగిపోయాను అని ఆమె పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rd

సంబంధిత వార్తలు: