సౌత్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్న జెనీలియా..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి జెనీలియా గురించి ప్రత్యేకంగా తెలుగు శని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా చాలా సంవత్సరాలు కెరియర్ ను కొనసాగించింది. ఇక ఈ బ్యూటీ మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ గా కొనసాగిస్తున్న సమయం లోనే హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి రితేష్ దేశ్ముఖ్ ను పెళ్లి చేసుకుంది.

ఇక పెళ్లి తర్వాత వీరి దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక జెనీలియా పెళ్లి తర్వాత తన భర్త , పిల్లల మంచి చెడులు చూసుకుంటూ సినిమా ఇండస్ట్రీ కి చాలా సంవత్సరాల పాటు దూరంగా ఉంది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితమే తన భర్త అయినటువంటి రితేష్ దేశ్ముఖ్ హీరో గా రూపొందిన వేద్ సినిమాలో నటించింది. ఇక పెళ్లి తర్వాత తన భర్తతో ఓ సినిమా నటించిన ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీ సినిమాలపై ప్రస్తుతం దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈమె మరికొన్ని రోజుల్లో సౌత్ ఇండస్ట్రీ కి సంబంధించిన సినిమాలలో నటించాలి అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిజం గానే ఈమె గనుక సౌత్ ఇండస్ట్రీ సినిమాలలో నటించాలి అని అనుకున్నట్లు అయితే ఈమెకు వరుసగా సౌత్ ఇండస్ట్రీ నుండి అవకాశాలు వచ్చే ఛాన్స్ చాలా వరకు ఉంది. మరి ఈమె నిజం గానే సౌత్ ఇండస్ట్రీ సినిమాలలో నటిస్తుందా ..? లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: