"అనుష్క" తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన "ప్రభాస్ "పెద్దమ్మ..!!

murali krishna
ప్రభాస్, అనుష్కల పెళ్లి గురించి ఇప్పటికీ రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. వాటిపై కృష్ణంరాజు భార్య శ్యామల దేవి స్పందించారు. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. యంగ్ హీరోలంతా పెళ్లి చేసుకొని పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటే..డార్లింగ్ మాత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉండిపోయాడు. అయితే గత కొద్ది కాలంగా ప్రభాస్, అనుష్క శెట్టి ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకున్నట్లు ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ వీరిద్దరు మాత్రం స్పందించలేదు. ఇవన్నీ పట్టించుకోకుండా వారి పనిలో బిజీగా ఉంటున్నారు. అయితే ఫ్యాన్స్ సైతం డార్లింగ్, స్వీటీ పెళ్లి చేసుకుంటే జంటగా చూడాలని ఆశ పడుతున్నారు.ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి అనుష్కతో పెళ్లిపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ''ప్రభాస్, అనుష్క పెళ్లి అని వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అందులో ఎలాంటి నిజం లేదు. ప్రభాస్ నచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పినా వద్దనే వారు ఎవరున్నారు అంతా తన ఇష్టం. జీవితాన్ని సంతోషంగా పంచుకోవడానికి తను ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తన మనసు చాలా స్వచ్ఛమైనది. వేరేవాళ్లు సంతోషంగా ఉన్నారంటే అది చూసి వాడు సంతోషపడతాడు. కాబట్టి పెళ్లి విషయం నేను ప్రభాస్ ఇష్టానికే వదిలేస్తున్నాను'' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్యామలా దేవి కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలా అయితే డార్లింగ్ కచ్చితంగా అనుష్కనే చేసుకుంటాడని అంటున్నారు.

కృష్ణంరాజుకు సీతాదేవి అనే మహిళతో ముందే పెళ్లయ్యింది. ఆమె చనిపోవడంతో శ్యామల దేవిని పెళ్లి చేసుకున్నారు. ఇక కృష్ణంరాజును రెండో పెళ్లి చేసుకోవడంపై శ్యామల దేవి చాలా పాజిటివ్‌గా స్పందించారు.‘‘సీతాదేవిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కృష్ణంరాజు. వాళ్ల అనుబంధం కూడా చాలా గొప్పగా ఉండేది. ఆమె అంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టం. సడెన్‌గా ఆమె యాక్సిడెంట్‌లో చనిపోయారు. కృష్ణంరాజు జీవితంలో విషాదం ఏదైనా ఉందంటే అదే. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. అది చూడలేక ఆయన తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోమని అన్నారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. అలా వారిద్దరి మధ్య చాలా చర్చలు జరిగాయట. ఇక వేరే దారిలేక ఆ వయసులో ఆయన తండ్రి తిండి మానేశారట. కృష్ణంరాజు పెళ్లికి ఓకే చెప్పేవరకు తిండి తినను అన్నారట. అప్పుడే నాకు కృష్ణంరాజు సంబంధం వచ్చింది’’ అని గుర్తుచేసుకున్నారు శ్యామల దేవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: