"సికిందర్" మూవీ లో ఆ స్టార్ బాలీవుడ్ బ్యూటీ..?

Pulgam Srinivas
తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఏ ఆర్ మురుగ దాసు ఒకరు . ఈయన ఆఖరుగా సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందిన దర్బార్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈయన ప్రస్తుతం తమిళ నటుడు కార్తికేయ హీరో గా రూపొందుతున్న ఓ మూవీ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందుతున్న మరో మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ మూవీ బృందం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి కరీనా కపూర్ ను తీసుకోవాలి అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ఆమెను కలిసి ఈ సినిమాకు సంబంధించిన కథను , అందులోని ఆమె పాత్రను వివరించనున్నట్లు ఆమెకు కనుక ఈ సినిమా కథ , అందులోని తన పాత్ర నచ్చినట్లు అయితే ఈ బ్యూటీ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతం లోనే సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ఎన్నో సినిమాలలో కరీనా కపూర్ నటించింది. వీరి జంటకు మంచి గుర్తింపు హిందీ సినీ పరిశ్రఎల్ ఉంది. మరోసారి వీరిద్దరి కాంబో లో సినిమా రాబోతుంది అనే వార్తలు బయటకు రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగితున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం సల్మాన్ ఖాన్ "టైగర్ 3" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: