అక్కడ చిరు బ్లెస్సింగ్స్ వల్ల... పవన్ మరియు నా విజయాలు మొదలయ్యాయి కార్తికేయ..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగించిన పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల క్రితం జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా 2019 వ సంవత్సరం పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తే రెండింటిలో కూడా ఓడిపోయాడు. ఇకపోతే పవన్ 2024 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నుండి పోటీ చేశాడు. ఇక నిన్న అందుకు సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి.

అందులో పవన్ కళ్యాణ్ తన సమీప అభ్యర్థి అయినటువంటి వైసీపీ నేత వంగా గీత పై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక పవన్ గెలుపొందడంతో అనేక మంది సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి కార్తికేయ కూడా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు అభినందనలు తెలియజేశారు. ఇకపోతే అందులో భాగంగా ఆయన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు.

తాను , అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర "విశ్వంభర" మూవీ సెట్స్ లోని హనుమంతుని విగ్రహం ముందు ఒకే చోట ఆశీస్సులు తీసుకున్నామని , అలా తీసుకొని ఇద్దరం కూడా ఘన విజయాలు అందుకున్నామని తెలిపాడు. అలాగే పవర్ స్టార్.. సారీ పిఠాపురం ఎమ్మెల్యే , ది గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పోస్ట్ చేసాడు. మిమ్మల్ని కొత్త స్థానంలో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని కార్తికేయ ఆసక్తికర పోస్ట్ చేసాడు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే కార్తికేయ హీరో నితిన్ గా రూపొందిన భజే భాయు వేగం సినిమా ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: