ఫలితాల తర్వాత ఆ మూవీ షూటింగ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న పవన్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నీది అగర్వాల్ హీరోయిన్గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎం రత్నం "హరిహర వీరమల్లు" అనే సినిమాను చాలా రోజుల క్రితమే స్టార్ట్ చేశాడు. ఈ మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ అటు క్రిష్ ఇద్దరు కూడా వేరే సినిమాలపై ఫోకస్ పెట్టడంతో ఈ మూవీ షూటింగ్ కొంత కాలం పాటు ఆగిపోయింది. ఆ తర్వాత వీరిద్దరూ తమ కమిట్మెంట్ లను పూర్తి చేసుకుని మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ షూటింగ్ మళ్ళీ ఆగిపోయింది.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో పూర్తి కాదు అనే ఉద్దేశంతోనో , మరే ఇతర కారణాలతోనూ తెలియదు కానీ దర్శకుడు క్రిష్ ఈ మూవీ నుండి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాత అయినటువంటి ఏ ఏం రత్నం అధికారికంగా ప్రకటించాడు. ఇక క్రిష్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకోవడంతో ఏ ఎం రత్నం కుమారుడు అయినటువంటి జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. అందులో భాగంగా ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ రీ స్టార్ట్ చేసి మొత్తం షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేసి ఈ సంవత్సరం డిసెంబర్ లో ఈ మూవీ ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా మొదటి భాగాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గత రెండు , మూడు నెలలుగా రాజకీయ పనులతో చాలా బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితం ఎలక్షన్ ముగిసాయి. రేపు ఫలితాలు రానుంది. ఈ ఫలితాల తర్వాత పవన్ మళ్ళీ హరిహర వీరమల్లు మూవీ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. పవన్ జూలై రెండవ వారం నుండి ఈ సినిమా కోసం చాలా తేదీలను ఇచ్చినట్లు , ఆ తేదీలలో పవన్ కి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని మేకర్స్ పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: