రాజమౌళి.. మహేష్ కాంబో మూవీ విషయంలో ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదంట..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని దర్శకుడుగా కెరీర్ ను కొనసాగిస్తున్న రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి మూవీతోను విజయాన్ని అందుకొని ప్రపంచ స్థాయిలో గుర్తింపు ను సంపాదించుకున్నాడు . ఆఖరుగా రాజమౌళి , రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలు గా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి క్రేజ్ ప్రపంచ వ్యాప్తం గా పెరిగి పోయింది.

ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత రాజమౌళి , మహేష్ బాబు హీరో గా ఓ సినిమా రూపొందించబోతున్నాడు.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ జోష్ లో జరుగుతున్నాయి . ఇలా ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్న సమయం లో రాజమౌళి ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఉంటే బాగుంటుంది అని డిసైడ్ అయినట్లు , అందు లో భాగంగా ఈమెను ఎలాగైనా ఈ సినిమాలో హీరోయిన్ గా ఓకే చేయించుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ వార్త కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఇప్పటివరకు మహేష్ సినిమాలో హీరోయిన్గా ఎవరిని అనుకోలేదట , ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చేలోపు ఈ కథలో ఎవరు హీరోయిన్ అయితే బాగుంటుందో వారిని సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనితో మహేష్ , రాజమౌళి కాంబో మూవీలో కపూర్ ను హీరోయిన్గా అనుకుంటున్నారు అనే వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: