సురేఖ ఏకంగా అన్నిసార్లు చూసినా రాంచరణ్ సినిమా ఏదో తెలుసా..??

murali krishna
తెలుగు  ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిది ఒక ప్రత్యేక స్థానం. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత అంతటి స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న నటుడాయన. ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ కు కష్టంవిలువ బాగా తెలుసు.అలాంటి తండ్రి కి కొడుకుగా సినిమా ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు మనందరికి తెలుసు. మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ అని చెప్పుకునే స్టేజి నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తన కొడుకుని చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతున్నారు. ఈ సందర్భంగానే తను చూసిన రాంచరణ్ సినిమాలో తనకుబాగా నచ్చిన సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు సురేఖ.ప్రతి తల్లికి తన బిడ్డ ఎంతో స్పెషల్ .. తన బిడ్డ  ఏదైనా కొత్త పని చేసిన గర్వించే పని చేసిన ఆ తల్లి మురిసిపోతుంది .. అది అందరికీ తెలిసిందే. అలాంటిదే సురేఖ కూడా మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.సురేఖ కొడుకు రామ్ చరణ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా చిరుత . ఈ సినిమాతో చరిత్ర తిరగరాసేసాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ గా మారుతాడు అని ప్రూవ్ చేశాడు .
ఈ సినిమాని సురేఖ ఏకంగా 100 సార్లకు పైగానే చూసిందట . దానికి కారణం కొడుకు ఫస్ట్ సినిమా కావడం . అప్పటివరకు తన కొడుకు ఇంట్లో ఎలా ఉంటాడు అనే విషయం మాత్రమే సురేఖకు తెలుసు . ఈ సినిమాలో నటించిన తర్వాత చరణ్ కి కోట్లాదిమంది తల్లులు చూసి ఎంకరేజ్ చేశారు. తన కొడుకు నటనను పదేపదే టీవీలో చూస్తూ మురిసిపోయేదట. సురేఖ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది .దీనికి సంబంధించిన వార్తను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు . ప్రజెంట్ రాంచరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.. రామ్ చరణ్ ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . రెండవ హీరోయిన్గా మలయాళీ బ్యూటీ మమిత బైజు సెలెక్ట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: