అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో "మనమే"... మొత్తం బడ్జెట్ ఎంతో తెలుసా..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ కెరియర్ ప్రారంభంలో హీరో గా నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈయన అతి తక్కువ కాలం లోనే హీరో గా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. హీరోగా ఈయన క్రేజ్ పెరిగిన తర్వాత శర్వా నటించిన సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవడంతో వరుసగా శర్వానంద్ కు చాలా అపజయాలు దక్కాయి. ఇలా వరుస అపజయాలతో డీలా పడిపోయిన ఈ నటుడు ఆఖరుగా ఒకే ఒక జీవితం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ నటుడు మనమే అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ జూన్ 7 వ తేదీన విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా బడ్జెట్ విషయంలో మేకర్స్ మొదటి నుండి పక్కా క్లారిటీగా ఉన్నట్లు అందుకోసమే అనుకున్న బడ్జెట్ లోపే ఈ మూవీ ని కచ్చితంగా తీయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ ని 30 కోట్ల బడ్జెట్లో తీయాలి అని మేకర్స్ ముందుగానే డిసైడ్ అయ్యి పక్కా ప్రణాళికలో ఈ మూవీ షూటింగ్ ను తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

దానితో ఈ మూవీ కేవలం 28.5 కోట్ల బడ్జెట్ లోనే పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక 30 కోట్లలో మిగిలిన డబ్బుతో ఈ సినిమా పబ్లిసిటీ చేసి అనుకున్న బడ్జెట్ లోపే ఈ మూవీ యొక్క అన్ని పనులను మేకర్స్ పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా పక్కా ప్రణాళికతో ఈ మూవీ ని అనుకున్న బడ్జెట్ లోపే థియేటర్స్ వరకు మేకర్స్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: